పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రజల సమస్యలు పరిష్కారమే సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే వచ్చి సమస్యల పరిష్కారానికి ప్రజల కార్యక్రమం అని పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోఏర్పాటుచేసిన ప్రజాపాలనకు హాజరైన శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్కరికి అమలు చేసేలా చూడాలని అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజి రెడ్డి, సర్పంచ్ గడ్డం బాలమణి, ఉప సర్పంచ్ శోభక్రిష్ణ రెడ్డి, వార్డ్ సభ్యులు లావణ్య నర్సింహులు, వనిత, భారతి గౌడ్ వనమ్మ, తదితరులు పాల్గొన్నారు.
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…