పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘పర్యావరణ, సమాజం, పరిపాలనలో (ఈఎస్జీ) సమకాలీన సనుస్యలు’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును 2024 ఫిబ్రవరి 16-17 తేదీలలో నిర్వహించనున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ ఎస్ జీ ప్రాముఖ్యత, పర్యావరణం, సమాజం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి అవగాహన పెంచడం ఈ సదస్సు లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ఎస్ జీలోని తాజా ధోరణులు, ఉత్తమ విధానాల గురించి పరిశ్రమ నాయకులు, పరిశోధకులు, విధాన రూపకర్తల నుంచి తెలుసుకునే ఒక ప్రత్యేక అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుందన్నారు.ప్రభుత్వ విధానాలు, నిబంధనలు, కార్పొరేట్ పద్ధతులు, పెట్టుబడి వ్యూహాలు, వాటాదారులకు అనుగుణంగా ఈఎస్ జీ కి సంబంధించిన అనేక విస్తృత అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. ఈఎస్ జీ విధానాలను అమలు చేయడంలో సవాళ్లు, అవకాశాలతో పాటు, సాంకేతికత పాత్ర, ఈఎస్ జీ విధానాలు, నిబంధనలలో అభివృద్ధి చెందుతున్న ధోరణుల గురించి ప్రధాన వక్తలు చర్చిస్తారని తెలిపారు.ఈ సదస్సులో పాల్గొనేవారు విస్తృత చర్చలలో పాల్గొనడంతో పాటు పరిశోధనా పత్రాలను కూడా సమర్పించ వచ్చని, పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసిన పరిశోధక పత్రాలను 2024 జనవరి 20వ తేదీలోగా సమర్పించాలని స్పష్టీక రించారు. ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు 2024 జనవరి 31లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన గీతం హైదరాబాద్ ప్రాంగణంలో వసతిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పేర్ల నమోదు, పత్ర సమర్పణ, బస తదితర వివరాల కోసం డాక్టర్ జీ.ఆర్.కే.ప్రసాద్ 95429 78515లో సంప్రదించాలని, లేదా guttinggitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…