Telangana

గీతమ్ లో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘పర్యావరణ, సమాజం, పరిపాలనలో (ఈఎస్జీ) సమకాలీన సనుస్యలు’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును 2024 ఫిబ్రవరి 16-17 తేదీలలో నిర్వహించనున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ ఎస్ జీ ప్రాముఖ్యత, పర్యావరణం, సమాజం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి అవగాహన పెంచడం ఈ సదస్సు లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ఎస్ జీలోని తాజా ధోరణులు, ఉత్తమ విధానాల గురించి పరిశ్రమ నాయకులు, పరిశోధకులు, విధాన రూపకర్తల నుంచి తెలుసుకునే ఒక ప్రత్యేక అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుందన్నారు.ప్రభుత్వ విధానాలు, నిబంధనలు, కార్పొరేట్ పద్ధతులు, పెట్టుబడి వ్యూహాలు, వాటాదారులకు అనుగుణంగా ఈఎస్ జీ కి సంబంధించిన అనేక విస్తృత అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. ఈఎస్ జీ విధానాలను అమలు చేయడంలో సవాళ్లు, అవకాశాలతో పాటు, సాంకేతికత పాత్ర, ఈఎస్ జీ విధానాలు, నిబంధనలలో అభివృద్ధి చెందుతున్న ధోరణుల గురించి ప్రధాన వక్తలు చర్చిస్తారని తెలిపారు.ఈ సదస్సులో పాల్గొనేవారు విస్తృత చర్చలలో పాల్గొనడంతో పాటు పరిశోధనా పత్రాలను కూడా సమర్పించ వచ్చని, పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసిన పరిశోధక పత్రాలను 2024 జనవరి 20వ తేదీలోగా సమర్పించాలని స్పష్టీక రించారు. ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు 2024 జనవరి 31లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన గీతం హైదరాబాద్ ప్రాంగణంలో వసతిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పేర్ల నమోదు, పత్ర సమర్పణ, బస తదితర వివరాల కోసం డాక్టర్ జీ.ఆర్.కే.ప్రసాద్ 95429 78515లో సంప్రదించాలని, లేదా guttinggitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago