Telangana

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ) డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు పలు ఔట్ రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.మదీనగూడలోని జెన్ సిస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్చరల్ మోడల్స్, డ్రాయింగులు, ముఖాముఖి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. అలాగే ఆచరణాత్మక, సృజనాత్మక అన్వేషణను ప్రోత్సహించే మందల ఆర్ట్ వర్కుషాపును కూడా నిర్వహించారు. మొత్తం 168 మంది జెన్ సిస్ విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ తరువాత, శ్రీ స్వామినారాయణ గురుకుల్ నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు, శ్రీ చైతన్య బాలురు (వివిధ సెషన్లలో 300, 500, 300 మంది), బాలికల (855 మంది) కోసం వరుస ఔట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రాంగణ అభవాలను, ఆర్కిటెక్చర్ విద్యపై ఆచరణాత్మక అవగాహనను, డిజైన్ ఆలోచనను పెంపొందించడంతో పాటు విభిన్న కెరీర్ అవకాశాల గురించి వివరించారు.ఈ కార్యక్రమాలన్నింటినీ గీతం ఆర్కిటెక్చర్ అధ్యాపకులు ఆర్.అభిషేక్ కుమార్ సింగ్, ఆర్.స్నిగ్ధరాయ్ సమన్వయం చేశారు. ఇవన్నీ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క విద్యాపరమైన అవగాహన, కెరీర్ మార్గదర్శనం పట్ల నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago