Telangana

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ) డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు పలు ఔట్ రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.మదీనగూడలోని జెన్ సిస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్చరల్ మోడల్స్, డ్రాయింగులు, ముఖాముఖి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. అలాగే ఆచరణాత్మక, సృజనాత్మక అన్వేషణను ప్రోత్సహించే మందల ఆర్ట్ వర్కుషాపును కూడా నిర్వహించారు. మొత్తం 168 మంది జెన్ సిస్ విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ తరువాత, శ్రీ స్వామినారాయణ గురుకుల్ నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు, శ్రీ చైతన్య బాలురు (వివిధ సెషన్లలో 300, 500, 300 మంది), బాలికల (855 మంది) కోసం వరుస ఔట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రాంగణ అభవాలను, ఆర్కిటెక్చర్ విద్యపై ఆచరణాత్మక అవగాహనను, డిజైన్ ఆలోచనను పెంపొందించడంతో పాటు విభిన్న కెరీర్ అవకాశాల గురించి వివరించారు.ఈ కార్యక్రమాలన్నింటినీ గీతం ఆర్కిటెక్చర్ అధ్యాపకులు ఆర్.అభిషేక్ కుమార్ సింగ్, ఆర్.స్నిగ్ధరాయ్ సమన్వయం చేశారు. ఇవన్నీ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క విద్యాపరమైన అవగాహన, కెరీర్ మార్గదర్శనం పట్ల నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago