Hyderabad

మాదాపూర్ లో సవర్ట్ ప్రధాన కార్యాలయంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయనపల్లి వినోద్ కుమార్

మనవార్తలు ,హైదరాబాద్:

హైదరాబాద్‌ మహానగరం త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌ కేంద్ర మారుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరమన్నారు. మెరుగైన మౌళిక వసతులు..పటిష్టమైన శాంతిభద్రతలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మాదాపూర్ లో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అండ్ టెక్నాలజీ కంపనీ సవర్ట్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రారంభించారు. ప్రత్యేక రాష్టం ఏర్పాటైన తర్వాత టీఎస్ ఐపాస్ లాంటి విధానాలను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తోందన్నారు.

అంతర్జాతీయంగా పేరొందిన బహుళ జాతి కంపనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతాయన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా కారణంగా వ్యవసాయంతో పాటు పారిశ్రామికరంగాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఒక చిన్న కంపెనీ ప్రారంభమై నేడు దేశంలోనే ఒక ప్రముఖ కంపెనీగా మారిందని సవర్ట్‌ కంపెనీ వ్యవస్థాపకులు సంకర్షచంద్రా అన్నారు. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా గ్లోబల్‌ విస్తరణ కోసం ప్రణాళికలను ఆయన ప్రకటించారు. త్వరలోనే కెనాడ, జర్మనీ వంటి దేశాల్లో సైతం తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వినోద్‌కుమార్‌, సంస్థ వ్యవస్థాపకులు సంకర్ష్‌ చంద్రాతో పాటు కంపెనీ ప్రతినిధులు, ఇన్వెస్లర్లు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago