బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
మున్సిపాలిటీ పరిధిలోని బొల్లారం పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేవదూతలు శాంతా క్లాజ్ వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు కౌన్సిలర్ వేణుపాల్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి , యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి’లు మాట్లాడుతూ భగవంతుడి బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ జీవించాలని సూచించారు. జీసస్ క్రైస్ట్ బోధనలు లోకానికి అనుసరణీయమన్నారు. క్రిస్మస్ వేడుకలను ప్రపంచ ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను పాఠశాల యజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జోబాబు , మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు , పాఠశాల హెచ్ఎం ప్రభు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…