బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
మున్సిపాలిటీ పరిధిలోని బొల్లారం పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేవదూతలు శాంతా క్లాజ్ వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు కౌన్సిలర్ వేణుపాల్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి , యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి’లు మాట్లాడుతూ భగవంతుడి బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ జీవించాలని సూచించారు. జీసస్ క్రైస్ట్ బోధనలు లోకానికి అనుసరణీయమన్నారు. క్రిస్మస్ వేడుకలను ప్రపంచ ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను పాఠశాల యజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జోబాబు , మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు , పాఠశాల హెచ్ఎం ప్రభు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…