బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
మున్సిపాలిటీ పరిధిలోని బొల్లారం పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేవదూతలు శాంతా క్లాజ్ వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు కౌన్సిలర్ వేణుపాల్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి , యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి’లు మాట్లాడుతూ భగవంతుడి బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ జీవించాలని సూచించారు. జీసస్ క్రైస్ట్ బోధనలు లోకానికి అనుసరణీయమన్నారు. క్రిస్మస్ వేడుకలను ప్రపంచ ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను పాఠశాల యజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జోబాబు , మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు , పాఠశాల హెచ్ఎం ప్రభు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…