– గ్రామస్తులు నగేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రాములు గౌడ్
– రెండు కల్లు దుకాణాలకే అనుమతులు అక్రమంగా వెలిసిన ఐదు దుకాణాలు
– చెప్పిన పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రెండు దుకాణాలకే అనుమతులు ఉన్నప్పటికీ మరో ఐదు దుకాణాలలో కల్లు అక్రమంగా విక్రయిస్తున్నారని గ్రామస్తులు నాగేష్ గౌడ్, రాములు, ఆంజనేయులు గౌడ్ లు ఆరోపించారు. మంగళవారం మండలంలోని భానుర్ గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతు గ్రామంలో రెండు కల్లు దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ గ్రామంలో విచ్చలవిడిగా కల్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వపరంగా రెండింటికే అనుమతులు ఉన్న ప్రభు గౌడ్, స్వామి గౌడ్, అనంతయ్య గౌడ్, నారాయణ గౌడ్, గంగయ్య గౌడ్ లు వెంకటేష్ గౌడ్ దగ్గర కల్లులు కొనుగోలు చేస్తూ గ్రామంలో విక్రయిస్తున్నారన్నారు. ఎన్నిసార్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అసలు మమ్ములను పట్టించుకోవడమే లేదని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. దుకాణాలను వేరొక వ్యక్తి తమ గ్రామంలో కల్లు దుకాణాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ మా పొట్ట కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణాలను మూసివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…