_వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్
మనవార్తలు ,పటాన్ చెరు:
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని రామేశ్వరం బండ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడే కాకుండా మంచి పరిపాలనాదక్షుడు అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు అని అన్నారు. తన వీరత్వం తో యువతరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, అంతి రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…