Telangana

ప్రజలకు అందుబాటులోకి రానున్న మెరుగైన రవాణా సౌకర్యం

_ఇస్నాపూర్ వరకు మెట్రో కూత..

_సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

_గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సత్యనారాయణ ఎంపిక పట్ల హర్షం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మియాపూర్ నుండి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల పటాన్చెరులో జరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన సభలో.. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు పొడిగించాలని కోరుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలి క్యాబినెట్ లోనే మెట్రో రైల్ విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే మెట్రో రైల్ విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు విస్తరణ పనులకు త్వరితగతిన ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago