మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం….
– ఎమ్మెల్సీ కవిత
– కల్వరి టెంపుల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ప్రారంభం
మనవార్తలు, మియాపూర్ :
హైదరాబాద్ మియాపూర్ లో కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డు రోగులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
ఆపన్న సమయంలో అండగా నిలిచేందుకు ఎల్లప్పుడు ముందుంటామని కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్ కుమార్ అన్నారు. కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో దాదాపు 300 పడకలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో యాభై పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంటుందని చెప్పారు.కరోనాతో చికిత్స తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కరోనా రోగితో పాటు అతనికి సహాయకులుగా ఉన్న వారికి కూడా వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో దాదాపు 12 మంది వైద్యులు, 20 మంది నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ తదితరులు లు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…