Hyderabad

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం…

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం….
– ఎమ్మెల్సీ కవిత
– కల్వరి టెంపుల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ప్రారంభం

మనవార్తలు, మియాపూర్ :

హైదరాబాద్ మియాపూర్ లో కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డు రోగులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
ఆపన్న సమయంలో అండగా నిలిచేందుకు ఎల్లప్పుడు ముందుంటామని కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్ కుమార్ అన్నారు. కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్​లో దాదాపు 300 పడకలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో యాభై పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంటుందని చెప్పారు.కరోనాతో చికిత్స తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కరోనా రోగితో పాటు అతనికి సహాయకులుగా ఉన్న వారికి కూడా వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో దాదాపు 12 మంది వైద్యులు, 20 మంది నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ తదితరులు లు పాల్గొన్నారు.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago