_ముఖ్య అతిథిగా పాల్గొన్న అరబిందో ఉపాధ్యక్షుడు డాక్టర్ సత్యేంద్రనాథ్
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హెదరాబాద్ మంగళవారం జాతీయ ‘ఉత్తమ తయారీ విధాన’ (జీఎంపీ) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అరబిందో ఫార్మా అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ క్వాలిటీ) డాక్టర్ సీ.వీ. సత్యేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఉత్తమ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్’ (జీఎంపీ) ప్రాముఖ్యతపై అతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. జీఎంపీ నాణ్యత హామీలో అంతర్భాగమైనదని, మంచి తయారీ అలవాట్లతో ముడిపడి ఉందన్నారు. పత్రాల తయారీ, సమీక్షించడం, ఆమోదించడం, జారీచేయడం, రికార్డింగ్, నిల్వ చేయడం వంటి క్రమబద్ధమైన ప్రక్రియలన్నీ ఉత్తమ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్లో భాగంగా ఆయన అభివర్ణించారు.
ఉత్తమ తయారీ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఔషధాలను స్థిరంగా ఉత్పత్తి చేయడంతో పాటు వినియోగానికి తగిన నాణ్యతా ప్రమాణాలతో, ఉత్పత్తి మార్గదర్శకాలకు అనుగుణంగా నియంత్రిస్తాయని డాక్టర్ సత్యేంద్రనాథ్ చెప్పారు. ఔషధాల తయారీలో నాణ్యత నిర్వహణ, సిబ్బంది అర్హత, పరిశుభ్రత, డాక్యుమెంటేషన్, రికార్డులు, పదార్థాల నిర్వహణ, ఉత్పత్తి, ప్యాకేజింగ్ వంటి అంశాల ప్రాధాన్యాన్ని కూడా ఆయన వివరించారు.గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ అతిథిని స్వాగతించి సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ హెన్డు పొన్నగంటి వందన సమర్పణ చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…