శేరిలింగంపల్లి :
బిసి బంధు ప్రకటించాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వివిధ జిల్లాలకు చెందిన సంఘం సభ్యులతో తరలి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రoలో వెనుకబడిన బిసికులాల అభివృద్ధికి బిసి బంద్ ప్రకటించాలని ఆర్. కృష్ణయ్య చేపట్టిన దీక్షకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోవడానికి అన్ని కులాల వారు కల్సి రావాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. బీసీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్య కు మనమంతా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని పేర్కొన్నారు. ధర్మ పోరాట దీక్షకు తరలి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్దతు తెలిసిన వారిలో సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ఈ. లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ తదితరులున్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…