పటాన్చెరు
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఈ నెల 14న బతుకమ్మ పండుగ, 15వ తేదీన దసరా పండుగను నిర్వహించాలని పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కోదండ సీతారామస్వామి దేవాలయం లో పండగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ పండగలు జరుపుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మను సాకి చెరువు కట్ట పైన, దసరా పండుగ రోజున జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో శమీ పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అందరూ ఎంతో ఇష్టంగా, భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పై చేపడుతున్న పనులను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఫ్లడ్ లైట్లతో పాటు మంచినీటి సౌకర్యం, శానిటేషన్ సిబ్బంది ని ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బల్దియా డిప్యూటీ కమీషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను నియోజకవర్గ ప్రజలందరు సంతోషంగా నిర్వహించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు..ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…