పటాన్చెరు
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఈ నెల 14న బతుకమ్మ పండుగ, 15వ తేదీన దసరా పండుగను నిర్వహించాలని పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కోదండ సీతారామస్వామి దేవాలయం లో పండగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ పండగలు జరుపుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మను సాకి చెరువు కట్ట పైన, దసరా పండుగ రోజున జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో శమీ పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అందరూ ఎంతో ఇష్టంగా, భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పై చేపడుతున్న పనులను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఫ్లడ్ లైట్లతో పాటు మంచినీటి సౌకర్యం, శానిటేషన్ సిబ్బంది ని ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బల్దియా డిప్యూటీ కమీషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను నియోజకవర్గ ప్రజలందరు సంతోషంగా నిర్వహించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు..ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…