Hyderabad

పటాన్చెరులో 14 న బతుకమ్మ, 15 న దసరా ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

పటాన్చెరు డివిజన్ పరిధిలో ఈ నెల 14న బతుకమ్మ పండుగ, 15వ తేదీన దసరా పండుగను నిర్వహించాలని పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కోదండ సీతారామస్వామి దేవాలయం లో పండగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ పండగలు జరుపుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మను సాకి చెరువు కట్ట పైన, దసరా పండుగ రోజున జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో శమీ పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అందరూ ఎంతో ఇష్టంగా, భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పై చేపడుతున్న పనులను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఫ్లడ్ లైట్లతో పాటు మంచినీటి సౌకర్యం, శానిటేషన్ సిబ్బంది ని ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బల్దియా డిప్యూటీ కమీషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు గూడెం మహిపాల్ రెడ్డి

తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను నియోజకవర్గ ప్రజలందరు సంతోషంగా నిర్వహించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు..ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago