politics

పోగుల ఆగయ్య నగర్ లో సమస్యలపై బస్తీ బాట

_స్మశాన వాటిక కు నిధులు మంజూరు అయిన పూర్తి కాని పనులు

_నాలాల విస్తరణ, కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేయాలని రవి కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు *

మనవార్తలు , శేరిలింగంపల్లి :

చందానగర్ డివిజన్ పోగుల ఆగయ్య నగర్ లో స్థానిక నాయకులతో, ప్రజలతో సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని చెప్పట్టారు రవి కుమార్ యాదవ్, ఈ  సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.నేటి తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతలకు ఆమడ దూరంలో ఉందని, ఏండ్లు గడుస్తున్నా నిధులు మంజూరై గ్రామంలోని స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హాయంలో నిధులు మంజూరు చేసిన గాని ఈ చేతగాని ప్రభుత్వం స్మశాన వాటిక పనులను పట్టించుకోకపోగా అక్కడ చెత్త చెదారం చేరి రాత్రి వేళలో విషసర్పాల భయంతో అక్కడి ప్రజలు జీవనం గడుపుతున్నారు అని తెలియజేశారు .

అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు నాలాల పై ఇల్లు నిర్మించుకోవడం వలన వర్షపు నీరు డ్రైనేజ్ వాటర్ పోనీ కారణంగా కాలనీ ముంపునకు గురవుతుందని వెంటనే నాలాల విస్తరణ చేపట్టి , ప్రతి రోజు పారిశుద్ధ్యం చెయ్యాలని జిహెచ్ఎంసి అధికారులను కోరడం .అదేవిధంగా స్థానిక ప్రజల అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి ,వెంకటేష్, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి ,రామకృష్ణ, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, బాబు, శ్రీను, రాము మొదలగు వారు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago