Telangana

ఆశా వర్కర్ల కు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలి : సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆశా వర్కర్ల కు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమ్మె లో భాగంగా 5 వరోజు గురువారం పటాన్ చెరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహసిల్దార్ భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.ఆశా వర్కర్ల కు పని భారం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.ఫిక్స్ డ్ వేతనం 18 వేలు నిర్ణయించి,అమలు చేయాలని అన్నారు.ప్రస్తుతం వారికి 9 వేల పారితోషకం వస్తుందన్నారు.నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని వచ్చే వేతనాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని వాపోయారు.ఆశా వర్కర్ల కు పి ఎఫ్, ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆశా వర్కర్ల కు హెల్త్ కార్డులు,ప్రమాద భీమా సౌకర్యం 5 లక్షలు, ఆశా లకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.డిమాండ్ల సాధన కోసం అనేక సందర్భాల్లో విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేక పోవటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె కు వెళ్ళడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఆశా వర్కర్లు గీత,హైమవతి,మాధవి,వైశ్నవి, వీరమని,సరిత, లక్ష్మీ ఇతరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

12 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

12 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

12 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

12 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago