Telangana

ఏరోస్పేస్లో ఎల్టీఏలకు సముచిత స్థానం : ప్రొ . పంత్

మనవార్తలు ,పటాన్ చెరు:

గాలి కంటే తేలికెన ( లెటర్ దాన్ ఎయిర్ – ఎల్టీఏ ) వ్యవస్థలు స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఎత్తులో ఉండగల సామర్థ్యం , తేలే శక్తి వంటి ప్రత్యేకతల కారణంగా ఏరోస్పేస్ సిస్టమ్స్ సముచిత స్థానాన్ని ఆక్రమించాయని ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్కుమార్ ఎస్.పంత్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ డిజెన్ అండ్ సెజింగ్ ఆఫ్ యాన్ ఇండోర్ ఎయిరిప్ ‘ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాల ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది . అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , ఏడాదిలోగా ఈ ప్రాంగణంలో ఎల్టీఏ వ్యవస్థను అభివృద్ధి చేసి , అమలులోకి తెస్తే ఈ వర్క్షాపు విజయవంతమైనట్టు భావిస్తానని ఆయన స్పష్టీకరించారు . ఎయిరిప్లు , ఏరోస్టాట్లు ఈ సాంకేతికత రెండు సూత్రాలని , ఇవి వేమానిక నిఘా , వెరైస్ కమ్యూనికేషన్ , ప్రోడక్ట్ ప్రమోషన్ వంటి అనేక పనుల కోసం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నట్టు ప్రొఫెసర్ పంత్ పేర్కొన్నారు .

ఎయిర్షిస్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణీకుల రవాణా , సరకు రవాణాలను తక్కువ ఖర్చుతో చేయవచ్చని , వాటికి పొడవైన రన్వేలు అవసరం లేదని . చాలా తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయని ఆయన వివరించారు . ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లే విద్యార్థులు స్కాలర్షిప్లు ఉంటేనే వెళ్లాలని ఆయన నొక్కిచెప్పారు . గీతం ప్రోగ్రామ్ డెరైక్టర్ ( రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ) ప్రొఫెసర్ కె.ఆర్.అనంత్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు . సెక్స్ట్స్ను అర్థం చేసుకోవడం చాలా సులువని , అయితే దానిని ఇంజనీరింగ్ గా మార్చడం సవాళ్లతో కూడుకున్నదని , అది వాణిజ్య కోణంలో చేయాలని చెప్పారు .

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య మాట్లాడుతూ , ప్రొఫెసర్ పంత్ వంటి వారి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు . తొలుత , ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి . హిమబిందు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త ఎం.సత్యప్రసాద్ వందన సమర్పణ చేశారు . ఈ ప్రారంభోత్సవంలో ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . బుధవారం వరకు ఈ కార్యశాల కొనసాగనుంది .

admin

Recent Posts

శ్రీ సాయి చైతన్య హై స్కూల్‌లో వసంత పంచమి వేడుకలు

చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో…

6 hours ago

ఈవీ చార్జింగ్ స్టేషన్ల ద్వారా యువతకు ఉపాధి పటాన్‌చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే పటాన్‌చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పర్యావరణ…

6 hours ago

బల్దియా అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు 27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల…

8 hours ago

స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా…

8 hours ago

ఐదు ఎకరాలలో డంపింగ్ యార్డ్ పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్, పటాన్‌చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చెత్త సమస్యకు శాశ్వత…

8 hours ago

మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన శివాలి

ఇప్పటివరకు 23 గిన్నిస్ రికార్డులతో పాటు 15 అసిస్ట్, 15 యూనిక్ వరల్డ్ రికార్డులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

8 hours ago