మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరి మన బడి పథకంలో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పురోగతిపై నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 54 పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందని, రెండో విడతలో మిగతా పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకొని.. ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో తాత్సారం చేయవద్దని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…