మనవార్తలు ,పటాన్ చెరు:
హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ చివరి ఏడాది బీటెక్ ( సీఎస్ఈ ) విద్యార్థిని ఆముక్త చౌదరి గద్దె ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ఐఎస్బీ ) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ ( పీజీపీ ) చదవడానికి అర్హత సాధించింది . యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ ( వెస్టైల్పీ ) లో భాగంగా , క్లాస్ -2025 పేరిట నిర్వహించనున్న పీజీపీ కోర్సులో ఆమె 2024 ఏప్రియల్లో ప్రవేశం పొందనున్నట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో వర్చూషా , టీసీఎస్లకు ఆముక్త ఎంపికయినట్టు తెలిపారు . స్నాతకోన్నత ( యూజీ ) , స్నాతకోత్తర ( పీజీ ) కోర్సులను అభ్యసించే విద్యార్థులు వెబైల్పి కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు .
దీనికి అర్హత సాధించినవారు 20 నెలల పాటు ఏదెన్జా పరిశ్రమలో పనిచేసిన అనుభవాన్ని తప్పనిసరిగా పొందాలని , అదే సమయంలో వారాంతాలలో ఐఎస్బీలో పీజీపీ చేస్తున్న విద్యార్థులు , అధ్యాపకులను కలిసి విషయ సంగ్రహణ చేయాల్సి ఉంటుందని వివరించారు . కోర్సు ఆరంభమయ్యే నాటికి ఇవన్నీ సంతృప్తికరంగా పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు . ఐఎస్బీలో ప్రవేశం సాధించిన ఆముక్తను గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…