మనవార్తలు పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18-20 తేదీలలో ‘డెటా సైన్స్’పై మూడు రోజల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ మంగళవారం తెలియజేశారు. డేటా సైన్స్ అనేది శాస్త్రీయ పద్ధతులు, ప్రక్రియలు, అల్గారిథమ్లు, కంప్యూటర్లను ఉపయోగించే ఒక అంతర్ విభాగం రంగమని, ఇది గణాంకాలు, సమాచార విశ్లేషణ, కంప్యూటర్ శాస్త్రం, వాటి సంబంధిత పద్ధతులను ఏకీకృతం చేయడానికి తోడ్పడుతుందన్నారు.
ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో పాల్గొనేవారు ఆయా అంశాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు అత్యాధునిక సాంకేతికతను అనుభవపూర్వకంగా తెలుసుకునే వీలుందని తెలిపారు. భారత గణాంక సంస్థకు చెందిన ప్రొఫెసర్ జీఎస్ఆర్ మూర్తి, గీతం ని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రజా, సీఎస్సీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాహుల్ రాయ్ లు ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని ఆయన వివరించారు. ఇందులో పాల్గొన దలచినవారు పేర్ల నమోదు, వసతి తదితర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్త సౌరవ్ బిస్వాస్ (70036 17793) ని సంప్రదించాలని లేదా sbiswas@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని డాక్టర్ ఫణికుమార్ సూచించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…