Telangana

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం

మనవార్తలు ,విజయవాడ:

స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, సమాజ సేవలో నిరంతర కృషికి గుర్తింపుగా యండిఆర్ ఫౌండేషన్‌కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.సామాజిక సేవా రంగంలో యండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అధ్యక్షుడు జయరాం కోమటి ముఖ్య అతిథిగా పాల్గొని యండిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులకు అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా జయరాం కోమటి  మాట్లాడుతూ యండిఆర్ ఫౌండేషన్ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, సమాజానికి అంకితభావంతో సేవ చేసే ఒక ఉద్యమం పేదలు, అనాథలు, విద్యార్థులు, యువత కోసం ఈ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, సంఘ నాయకులు, సామాజిక కార్యకర్తలు యండిఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు.విద్యా ప్రోత్సాహం, పేదలకు ఆర్థిక సహాయం, సామాజిక సేవా కార్యక్రమాలు, అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, యువతకు మార్గనిర్దేశం మరియు ప్రోత్సాహం వంటి అనేక రంగాల్లో యండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా మానవతా విలువలను కాపాడుతూ, అవసరమైన వారికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న యండిఆర్ ఫౌండేషన్ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా మారుతోందని వక్తలు పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు మరింత ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.ఈ అవార్డు ద్వారా యండిఆర్ ఫౌండేషన్ సేవలకు మరింత గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో ఇంకా విస్తృత స్థాయిలో సేవలు అందించేందుకు ఇది ప్రోత్సాహంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago