మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…
– మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్..
పటాన్ చెరు:
కోవిద్ 19 ను అంతమోదించడానికి సామాజిక దూరం పాటించడం ,మాస్క్ ధరించడంతో పాటు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్కురి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు.
అనంతరం నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశీయ వాక్సిన్ ను పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారందరికీ ఉచితంగా అందిస్తామని మోది ప్రకటనతో దేశవ్యాప్తంగా మోదీ ఫ్లేక్సీలకు, చిత్రపటాలకు పూలాభిషేకాలు మరియు పాలాభిషేకాలు బిజెపి కార్యకర్తలు నిర్వహించారు
జాతినుద్దేశించిన ప్రసంగించిన భారతప్రధాని నరేంద్ర మోదీ గారు దేశప్రజలందరికీ వరాలజల్లులు కురిపించారని తెలిపారు..పద్దెనిమిది సంవత్సరాలు నిండిని భారతపౌలందరికీ జూన్ 21 నుండి ఉచితంగా కోవిడ్ టీకాలు అందిస్తామని అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు.ప్రవేటు ఆసుపత్రులకు ఇరవైదు శాతం టీకాలు అందిస్తామని..అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం నవంబర్ (దీపావళి) వరకు పొడిగిస్తు ఎనభైకోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు… నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజసంక్షేమం కోసం కట్టుబడి ఉందని, మోది ప్రభుత్వం కరోనాతో, శత్రుదేశాలతో యుద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు మోదితో యుద్ధం చేస్తున్నారని జగదీశ్వర్ గౌడ్ విమర్షించారు.టీకాల విషయంలో ప్రతిపక్షాల పుకార్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రజలంతా మోదికి అండగా ఉన్నారని తెలిపారు.. డిసెంబర్ నాటికి ప్రతి భారతీయుడికి టీకా ఖచ్చితంగా అందుతుందని కరోనా జయించడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కొల్కురి రాజశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు, ఆశిష్ గౌడ్ బీజేవైఎం రాష్ట్ర ఉప అధ్యక్షుడు, శ్రీనివాస్ గుప్తా, సుజాత, మురళీధర్ వర్మ, అంతం గౌడ్, జగన్ రెడ్డి, అంగడి బాలరాజు, రాజు గౌడ్ బిజెపి కార్యకర్తలు, మోది అభిమానులు పాల్గొన్నరు..
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…