politics

త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు

_చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి – నాగపూరి రమేష్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మంగళవారం రోజు మియాపూర్ మదీనా కూడా లోని త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ బాస్కర్ రెడ్డి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి లు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల ద్వారా రోగనిరోదక శక్తి మరియు మానసికంగానూ, శారీరికంగానూ దృఢంగా తయారవుతారని తెలిపారు.

క్రీడల్లో పాల్గొనడం రాణించడం, ఛాంపియన్షిప్ కోసం పోరాడాలని, అందుకు ప్రతి విద్యార్థికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత చేసే పనిపై ఆసక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు కళ్ళలాంటివని, వాటిని రెండింటిని సామానoగా పాటిస్తూ రెండిట్లో రాణించాలని కోరారు క్రీడారంగాన్ని తమకేరిర్ రంగంగా ఎంచుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించి తాము చదువుకున్న స్కూల్స్ కి తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆడుకోవాలని తపన కోచ్ ల పట్ల గౌరవం, స్నేహభావం పెంపొందించుకుంటే, పోటీల్లో చివరి వరకు నిలబడడం వల్ల విజయాలు చేకూరుతాయని అన్నారు.

క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, గెలిచిన వెంటనే పొంగిపోకుండా కృతజ్ఞతా భావంతో ఉండాలని, ఓడిన వారిని ప్రోత్సహించాలని సూచించారు. గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, త్రివేణి పాఠశాలలో క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని, విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి కి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మార్చి పాస్ట్ తో పాటు, శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించారు సి ఎ సి నాటకం డా. నటరాజు, సి ఆర్ ఓ సాయి నరసింహారావు, నరేష్ ఫోర్ ఏ సెంట్రల్ 111 కో ఆర్డినేటర్ చక్రి. సుబ్బారావు. పాఠశాల ప్రధానాచార్యులు, కృష్ణ, మాలిని, జగదీశ్వర రావు, వైస్ ప్రిన్సిపల్ హిమబిందు, అనిత, మరియు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులకు వేధింపులా

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 hours ago

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…

5 hours ago

లక్డారం రైతుల భూములను రక్షించాలి

ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…

5 hours ago

గీతంలో ఉత్సాహభరితంగా యోగా దినోత్సవం

ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…

5 hours ago

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

18 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

19 hours ago