అమీన్ పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
నిజాం నిరంకుశ వ్యతిరేక పాలక, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పటాన్చెరు బీజేపీ నేత ఎడ్ల రమేష్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ పద్మశాలిసంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . తెలంగాణ ఉద్యమంలో 85 సంవత్సరాల వయస్సులో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహదాతగా తనకు అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. పద్మశాలి సంఘం నేతలు ఎక్కడ విగ్రహం పెట్టాలో నిర్ణయిస్తే అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసంమూడు దశల్లో ఉద్యమాల్లోప్రముఖ పాత్ర పోషించారని ఎడ్ల రమేష్ కొనియాడారు. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల స్వప్నం మాత్రం ఆయన చూడలేకపోయాడన్నారు. నిరంతరం ప్రజాసేవ కోసం తపించే వ్యక్తి సేవలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…