Telangana

అట్టహాసంగా ముగిసిన అథ్లెటిక్ మీట్

_విజేతలకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థిని విద్యార్థులు

_హోరాహోరీగా ముగిసిన ముగింపు పోటీలు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

పాఠశాల స్థాయి నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు అనుగుణంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పటాన్చెరు పట్టణం లోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన పటాన్చెరు నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అథ్లెటిక్ మీట్ ముగింపు పోటీల కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 34 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జీవితంలో విద్య ఎంత ముఖ్యమో.క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకి క్రీడా పోటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడా హబ్ గా తీర్చబోతున్నట్లు తెలిపారు.నేటి సమాజానికి పెనుముప్పుగా మారిన డ్రగ్స్ కు ఆమడ దూరంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ లు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానంద్, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగా రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నగేష్ యాదవ్, షేక్ హుస్సేన్, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వివిధ మండలాల విద్యా శాఖ అధికారులు రాథోడ్, జెమినీ కుమారి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago