గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఐఐఐడీ నిపుణుల ఉద్బోధ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిర్మాణ రూపకల్పన (ఆర్కిటెక్చరల్ డిజైన్)లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, ఆవిష్కరణలు అవశ్యమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియల్ డిజైనర్స్ (ఐఐఐడీ) నిపుణులు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ విద్యార్థులు ఇటీవల లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ లో ఐఐఐడీ నిర్వహించిన ఐత్రీ సిరీస్ ఐదవ ఎడిషన్ లో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు, అనుభవజ్జులైన నిపుణుల మధ్య వారధిగా ఈ కార్యక్రమం పనిచేయడమే గాక, వారి నుంచి నేర్చుకోవడానికి, నిపుణులతో కొంత సమయం గడపడానికి తోడ్పడింది.నవీన్ పానుగంటి. షమిలా మీరన్, అమిత్ షాలతో సహా పేరొందిన ఆర్కిటెక్ట్ లు తమ వృత్తిపరమైన ప్రయాణాలు, డిజైన్ మెళకువలను విద్యార్థులతో పంచుకున్నారు. తరువాతి తరం వాస్తుశిల్పులను ప్రేరేపించడం, విద్యావంతులను చేయడం యొక్క ప్రాముఖ్యతను వారు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలకు వారు వివరణాత్మక జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. అంతే కాక, గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఐఐఐడీ విద్యార్థి సభ్యత్వ ధృవీకరణ పత్రాలను ఇవ్వడం విశేషం. ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎదుగుదల.. రెండింటినీ ప్రోత్సహిస్తూ ఐఐఐడీ, గీతం ఆర్కిటెక్చర్ స్కూలు మధ్య కొనసాగుతున్న సహకారంలో ఇదో మైలురాయిగా నిలిచిపోనుంది. విద్యార్థులు, నిర్మాణ సంస్థల మధ్య సంబంధాలను పెంపొందించడంలో ఇది మరో విజయవంతమైన చొరవగా గుర్తించబడింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…