గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఐఐఐడీ నిపుణుల ఉద్బోధ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిర్మాణ రూపకల్పన (ఆర్కిటెక్చరల్ డిజైన్)లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, ఆవిష్కరణలు అవశ్యమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియల్ డిజైనర్స్ (ఐఐఐడీ) నిపుణులు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ విద్యార్థులు ఇటీవల లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ లో ఐఐఐడీ నిర్వహించిన ఐత్రీ సిరీస్ ఐదవ ఎడిషన్ లో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు, అనుభవజ్జులైన నిపుణుల మధ్య వారధిగా ఈ కార్యక్రమం పనిచేయడమే గాక, వారి నుంచి నేర్చుకోవడానికి, నిపుణులతో కొంత సమయం గడపడానికి తోడ్పడింది.నవీన్ పానుగంటి. షమిలా మీరన్, అమిత్ షాలతో సహా పేరొందిన ఆర్కిటెక్ట్ లు తమ వృత్తిపరమైన ప్రయాణాలు, డిజైన్ మెళకువలను విద్యార్థులతో పంచుకున్నారు. తరువాతి తరం వాస్తుశిల్పులను ప్రేరేపించడం, విద్యావంతులను చేయడం యొక్క ప్రాముఖ్యతను వారు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలకు వారు వివరణాత్మక జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. అంతే కాక, గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఐఐఐడీ విద్యార్థి సభ్యత్వ ధృవీకరణ పత్రాలను ఇవ్వడం విశేషం. ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎదుగుదల.. రెండింటినీ ప్రోత్సహిస్తూ ఐఐఐడీ, గీతం ఆర్కిటెక్చర్ స్కూలు మధ్య కొనసాగుతున్న సహకారంలో ఇదో మైలురాయిగా నిలిచిపోనుంది. విద్యార్థులు, నిర్మాణ సంస్థల మధ్య సంబంధాలను పెంపొందించడంలో ఇది మరో విజయవంతమైన చొరవగా గుర్తించబడింది.
ఎస్ఐఆర్లో పాల్గొనండి.. పటాన్చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…