– కిర్బీ పరిశ్రమలో వరసగా నాలుగవసారి సిఐటియు విజయ దుందుభి
– బిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు గెలుపు
– ఎన్ని కుయుక్తులు పన్నిన … విజయం ఎర్రజెండాదే
– పరిశ్రమలో కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ
బాణసంచా కాల్చి, సంబురాలలో మునిగిన కార్మికులు
ఈ విజయం కిర్బీ కార్మికులకు అంకితం
కిర్బీ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మండలంలోని పాశం మైలారం పారిశ్రామిక వాడ లో గల కిర్బీ పరిశ్రమలో గురువారం జరిగిన కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు నాలుగోసారి విజయ దుందుభి మోగించింది. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు,బిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు బరిలో నిలిచారు. పరిశ్రమలో మొత్తము 578 ఓట్లకు గాను 576 ఓట్లు పోలవగా 2 ఓట్లు చెల్లలేవు, సీఐటీయూ కి 295, బిఆర్టీయూ కూటమికి 281 ఓట్లు రాగా 14 ఓట్ల తేడాతో బిఆర్టియూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కార్మికులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న సిఐటియు ఎర్రజెండా ను వరుసగా నాలుగవసారి గెలిపించిన కిర్బీ కార్మికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. సిఐటియు గెలుపుతో కార్మికుల జీవితాలు బాగుపడతాయని నమ్మిన కార్మికులు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధించేందుకు ఈ గెలుపు దోహదపడుతుందని అన్నారు. సిఐటియుతోనే కార్మికులకు రక్షణ ఉంటుందన్నారు.
కార్మికులకు ఇచ్చిన హామీలన్నిటిని రాబోయే రోజుల్లో నెరవేర్చే విధంగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని యూనియన్లు కూటములుగా ఏర్పడిన, ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ ఎర్రజెండాదే విజయన్నారు. ఈ గెలుపు కార్మికుల విజయం గా ఆయన అభివర్ణించారు. సీఐటీయును కార్మికులు ఆదరించి నాలుగవసారివిజయం అందించిన కార్మికులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.గెలిచిన వెంటనే పరిశ్రమలో కార్మికుల సంబురాలు అంబరానంటాయి. నాయకులను రంగులతో ముంచెత్తి సంబరాలు చేసుకున్నారు
ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కే రాజయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు పి మల్లేశం పాశమైలారం పారిశ్రామిక వాడ క్లస్టర్ కన్వీనర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ..మానిక్, పి. పాండురంగ రెడ్డి, కిర్బీ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రాజు, యూనియన్ నాయకులు తలారి శ్రీనివాస్, నాగప్రసాద్, రాములు, లకన్, జైపాల్, సోమన్న, ప్రవీణ్, శంకర్, బిలాల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…