Hyderabad

వివేకానందున్నీ ఆదర్శంగా తీసుకోవాలి – గజ్జల యోగానంద్

మనవార్తలు, శేరిలింగంపల్లి :

నేటి యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని గజ్జెలు యోగానంద్ పిలుపునిచ్చారు.స్వామి వివేకానందులంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహావీరులెందరికో ఆయన ఆదర్శమని, నేటి రోజుల్లో లక్ష్యం కోసం శ్రమించే యువతరం గుండెల్లో ఆయన నిత్యం రగిలే జ్వాల అని తెలిపారు. ఎప్పుడో సుమారు 130 ఏళ్ల కిందట అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానందులు చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉందన్నారు.

అందుకే వివేకానందుని జయంతిని మన జాతీయ యువదినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బుధవారం రోజు ఆ మహనీయుని 160వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి, చందానగర్‌, మైత్రీ నగర్ జంక్షన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ అమెరికాలో సర్వమత సమ్మేళనానికి ముందు వివేకానందులు అక్కడ అనేక రోజులు తిండి, నిద్ర లేకుండా రైలు పెట్టెలో గడిపి అనేక కష్టాలు పడ్డారని, అయితే, సర్వమత సమ్మేళనం తర్వాత వారి గొప్పదనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని నాటి విశేషాలను తెలియజేశారు. వివేకానందుల బోధనలన్నీ ప్రాక్టికల్‌గా నేటికి కూడా ఆచరించదగినవేనని పేర్కొన్నారు.

 

సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి స్వామి వివేకానందుల చరిత్రను చదువుకోవాలని పిలుపునిచ్చారు. గమ్యం చేరుకునే వరకూ నిద్రపోవద్దని విజయంతో విర్రవీగవద్దని , అపజయానికి కుంగిపోవద్దని వివేకానందులు చెప్పిన సూక్తులను యోగానంద్ స్మరించుకున్నారు.స్వామి వివేకానంద 1893వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించిన విషయాన్ని కూడా యోగానంద్ తమ ప్రసంగంలో గుర్తు చేశారు.

సికింద్రాబాదులోని మెహబూబియా కాలేజీలో మిషన్ టు ది వెస్ట్ అనే అంశంపై ఫిబ్రవరి 13న ప్రసంగించారని, ఆ రోజును వివేకానంద డేగా ప్రకటించాలని వివేకానందుల భక్తులు, రామకృష్ణ మఠంవారు కోరుకుంటున్నందున, ఆ కోరిక నెరవేరాలని మనమూ ఆకాంక్షిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పోరెడ్డి బుచ్చి రెడ్డి, అసెంబ్లీ, రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago