Telangana

సామాజిక సేవలో అందరు భాగస్వాములు అవ్వాలి పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి

_పేదలకు అందుబాటులో వైద్యం
అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర

_బడుగు జీవులకు ఖరీదైన వైద్యం
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
సామాజిక సేవలు విస్తరిస్తాం

_మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్

అమేధ హాస్పిటల్స్ సౌజన్యంతో,మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకరకంగా సామాజిక సేవలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి ఉంటుందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో అమేధ హాస్పిటల్స్  సౌజన్యంతో మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమేధ హాస్పిటల్స్ యజమాన్యం వందమందికి పైగా పలు రకాల వైద్య సేవల తోపాటు ఉచిత మందులు, టెస్టులు నిర్వహించారు. అవసరమైన వారికి హాస్పిటల్ కి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు పట్టణ ప్రాంతాలలో కొంతమేర వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ రూరల్ ఏరియాలో అవగాహన లేమితో ప్రజలు ఫ్రీ డయాబెటిక్, డయాబెటిక్ వంటి రోగాల బారిన పడుతు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయటంతో పాటు వారిలో అవగాహన తో పాటు చైతన్య పరచలాని సూచించారు.

అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతు పటాన్ చెరు పట్టణంలో హాస్పిటల్ పెట్టిన రోజు నుంచి కార్మికులు,పేద, మధ్యతరగతి వాళ్లకు కమర్షియల్ ఆలోచన తో కాకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ముందు కూడా సామాజిక సేవ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతామని గ్రామాలలో అందరి సహాయ సహకారాలతో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంవికే ఫౌండర్ రాజయ్య మాట్లాడుతు ప్రైవేటు హాస్పిటల్ వైద్యం అంటేనే ఖరీదైనదిగా భావిస్తున్న ఈ రోజుల్లో అన్ని సదుపాయాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తూ అట్టడుగు బడుగు జీవులలో వెలుగు నింపుతున్న అమేధ హాస్పిటల్స్ యజమాన్యాన్ని అభినందించారు.మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మా సంస్థ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనంజయ్,రాజశేఖర్, చిరంజీవి, సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి నాగేశ్వరరావు, అర్జున్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago