_పేదలకు అందుబాటులో వైద్యం
అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర
_బడుగు జీవులకు ఖరీదైన వైద్యం
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
సామాజిక సేవలు విస్తరిస్తాం
_మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్
అమేధ హాస్పిటల్స్ సౌజన్యంతో,మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకరకంగా సామాజిక సేవలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి ఉంటుందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో అమేధ హాస్పిటల్స్ సౌజన్యంతో మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమేధ హాస్పిటల్స్ యజమాన్యం వందమందికి పైగా పలు రకాల వైద్య సేవల తోపాటు ఉచిత మందులు, టెస్టులు నిర్వహించారు. అవసరమైన వారికి హాస్పిటల్ కి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు పట్టణ ప్రాంతాలలో కొంతమేర వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ రూరల్ ఏరియాలో అవగాహన లేమితో ప్రజలు ఫ్రీ డయాబెటిక్, డయాబెటిక్ వంటి రోగాల బారిన పడుతు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయటంతో పాటు వారిలో అవగాహన తో పాటు చైతన్య పరచలాని సూచించారు.
అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతు పటాన్ చెరు పట్టణంలో హాస్పిటల్ పెట్టిన రోజు నుంచి కార్మికులు,పేద, మధ్యతరగతి వాళ్లకు కమర్షియల్ ఆలోచన తో కాకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ముందు కూడా సామాజిక సేవ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతామని గ్రామాలలో అందరి సహాయ సహకారాలతో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంవికే ఫౌండర్ రాజయ్య మాట్లాడుతు ప్రైవేటు హాస్పిటల్ వైద్యం అంటేనే ఖరీదైనదిగా భావిస్తున్న ఈ రోజుల్లో అన్ని సదుపాయాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తూ అట్టడుగు బడుగు జీవులలో వెలుగు నింపుతున్న అమేధ హాస్పిటల్స్ యజమాన్యాన్ని అభినందించారు.మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మా సంస్థ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనంజయ్,రాజశేఖర్, చిరంజీవి, సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి నాగేశ్వరరావు, అర్జున్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…