politics

ఘనంగా ముగిసిన ఎస్ జి ఎఫ్ జిల్లా క్రీడోత్సవాలు

విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంగా గత వారపు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు శనివారం సాయంత్రం ఘనంగా మూసాయి. అనంతరం విజేతలకు పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి క్రీడోత్సవాలకు పటాన్చెరు వేదిక చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ మాట్లాడుతూ..కోకో, వాలీబాల్, కబడ్డీ అంశాల్లో అండర్ 17, అండర్ 14 విభాగాల్లో క్రీడలు నిర్వహించామని తెలిపారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన జట్లను రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గౌసుద్దీన్, వ్యాయామ ఉపాధ్యాయులు షర్ఫుద్దీన్, ఆసిఫ్, కిష్టయ్య, రామరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago