Telangana

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటాం _నీలం మధు ముదిరాజ్

సమగ్ర కుల సర్వే తో బీసీలకు పెరుగనున్న రాజకీయ ప్రాతినిధ్యం
నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారంఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కులగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో హైదరాబాద్ బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన సంప్రదింపులు,సలహాల సదస్సు కు రాహుల్ గాంధీ  పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం నీలం మధు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చేపట్టిన కులగణన తో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని నీలం మధు స్పష్టం చేశారు. ఈ కులగణన తో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగడంతో పాటు వెనుకబడిన తరగతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే తోడ్పడుతుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ , ప్రజా ప్రతినిధులందరికీ బీసీ వర్గాల పక్షాన నీలం మధు ధన్యవాదాలు తెలిపారు.

admin

Recent Posts

నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…

21 hours ago

గీతంలో ఎన్.సీ.సీ.పై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…

21 hours ago

మహాత్మ బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…

21 hours ago

యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…

1 day ago

సివిల్ ఇంజనీరింగ్ లో అహ్మద్ మిన్హాజుద్దీన్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

3 days ago

ప్రజల నిర్ణయమే ఫైనల్

అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…

3 days ago