రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
హిందూ ముస్లీంల మత సామరస్యానికి పండుగలు ఎంతగానో దోహదపడతాయని ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పెద్ద మసీదు వద్ద వెయ్యి మంది పేద ముస్లీం కుటుంబాలకు పది లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్పండుగను ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలన్నారు . నిరుపేదల ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల సన్నబియ్యం, కేజీ కందిపపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ సెమియా, కేజీ చక్కెర, లీటరు వంటనూనె ఇతర నిత్యావసర సరుకులను అందించారు.
రంజాన్ పండగను అందరు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ,ఆనందోత్సహాలతో జరుపుకోవాలన్నారు. నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఏకే ఫౌండేషన్ ఏర్పాటు చేశామని సంస్థ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకొని తోఫాలను అందజేశామన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…