Telangana

గీతమ్ ను సందర్శించిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ బృందం…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇద్దరు సభ్యులతో కూడిన అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎసియూ) ప్రతినిధి బృందం శుక్రవారం హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ ద్విసభ్య ప్రతినిధి బృందంలో ఏఎసీయూలోని డబ్ల్యూపీ కారీ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్ బ్రెట్ డ్వార్జే, అంతర్జాతీయ విద్యార్థులు, స్కాలర్ల కేంద్రం అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ హోలీ సింగ్ ఉన్నారు.ఈ ఇరువురూ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్లోని వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించారు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోగల ప్రాంతాలు, ముఖ్యంగా శిక్షణ, పరిశోధనా సహకారం, గీతం విద్యార్థులకు ఫీజులో మినహాయింపు వంటి అంశాలపై ప్రాథమికంగా చర్చించారు.ఆ తరువాత అరిజోనా బృందం గీతం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో, డాక్టర్ బ్రెట్ డ్వార్జే ‘బిజినెస్ అనలిటిక్స్ అండ్ ద రోల్ ఆఫ్ ది డెసిషన్ సెంటిస్ట్’ అనే అంశంపై ప్రసంగించారు.

విద్యార్థులు కేవలం డేటా సెంటిస్టులుగా మాత్రమే కాకుండా కార్యనిర్వాహక శాస్త్రవేత్తలు (డెసిషన్ సెంటిస్ట్)గా ఎదగాలని ఆయన అభిలషించారు. డబ్ల్యూపీ కేరీ స్కూల్ గురించి, అది నిర్వహిస్తున్న కోర్సులు వివరాలను ఆయన తెలియజేశారు. గీతం విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ, తమ బీ-స్కూల్లో ప్రవేశం పొందడానికి ఎటువంటి పని అనుభవం అవసరం లేదని, 15 ఏళ్లు భారత్లో విద్యాభ్యాసం చేసిన ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణల్లో ఏఎస్యూ అమెరికాలోనే తొలి స్థానంలో నిలిచిందని, సప్లయ్ చెన్డ్ విభాగం ద్వితీయ స్థానం సాధించినట్టు డాక్టర్ బ్రెట్ సగర్వంగా ప్రకటించారు.అరిజోనా స్టే వర్సిటీలో ప్రస్తుతం దాదాపు 12 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారని, అందులో దాదాపు 6,600 మంది భారతీయులని హోలీ సింగ్ వివరించారు. భారతీయ విద్యార్థులలో రెండు వేల మంది సీఎస్ఈ, వెయ్యేసి మంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీలను అభ్యసిస్తున్నట్టు ఆయన తెలిపారు. దాదాపు 1300 మంది భారతీయ యూజీ విద్యార్థులలో 95 శాతం మంది సీఎస్సీ చదువుతున్నారన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

14 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago