Telangana

గీతమ్ ను సందర్శించిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ బృందం…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇద్దరు సభ్యులతో కూడిన అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎసియూ) ప్రతినిధి బృందం శుక్రవారం హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ ద్విసభ్య ప్రతినిధి బృందంలో ఏఎసీయూలోని డబ్ల్యూపీ కారీ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్ బ్రెట్ డ్వార్జే, అంతర్జాతీయ విద్యార్థులు, స్కాలర్ల కేంద్రం అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ హోలీ సింగ్ ఉన్నారు.ఈ ఇరువురూ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్లోని వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించారు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోగల ప్రాంతాలు, ముఖ్యంగా శిక్షణ, పరిశోధనా సహకారం, గీతం విద్యార్థులకు ఫీజులో మినహాయింపు వంటి అంశాలపై ప్రాథమికంగా చర్చించారు.ఆ తరువాత అరిజోనా బృందం గీతం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో, డాక్టర్ బ్రెట్ డ్వార్జే ‘బిజినెస్ అనలిటిక్స్ అండ్ ద రోల్ ఆఫ్ ది డెసిషన్ సెంటిస్ట్’ అనే అంశంపై ప్రసంగించారు.

విద్యార్థులు కేవలం డేటా సెంటిస్టులుగా మాత్రమే కాకుండా కార్యనిర్వాహక శాస్త్రవేత్తలు (డెసిషన్ సెంటిస్ట్)గా ఎదగాలని ఆయన అభిలషించారు. డబ్ల్యూపీ కేరీ స్కూల్ గురించి, అది నిర్వహిస్తున్న కోర్సులు వివరాలను ఆయన తెలియజేశారు. గీతం విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ, తమ బీ-స్కూల్లో ప్రవేశం పొందడానికి ఎటువంటి పని అనుభవం అవసరం లేదని, 15 ఏళ్లు భారత్లో విద్యాభ్యాసం చేసిన ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణల్లో ఏఎస్యూ అమెరికాలోనే తొలి స్థానంలో నిలిచిందని, సప్లయ్ చెన్డ్ విభాగం ద్వితీయ స్థానం సాధించినట్టు డాక్టర్ బ్రెట్ సగర్వంగా ప్రకటించారు.అరిజోనా స్టే వర్సిటీలో ప్రస్తుతం దాదాపు 12 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారని, అందులో దాదాపు 6,600 మంది భారతీయులని హోలీ సింగ్ వివరించారు. భారతీయ విద్యార్థులలో రెండు వేల మంది సీఎస్ఈ, వెయ్యేసి మంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీలను అభ్యసిస్తున్నట్టు ఆయన తెలిపారు. దాదాపు 1300 మంది భారతీయ యూజీ విద్యార్థులలో 95 శాతం మంది సీఎస్సీ చదువుతున్నారన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago