రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
హిందూ ముస్లీంల మత సామరస్యానికి పండుగలు ఎంతగానో దోహదపడతాయని ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పెద్ద మసీదు వద్ద వెయ్యి మంది పేద ముస్లీం కుటుంబాలకు పది లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్పండుగను ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలన్నారు . నిరుపేదల ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల సన్నబియ్యం, కేజీ కందిపపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ సెమియా, కేజీ చక్కెర, లీటరు వంటనూనె ఇతర నిత్యావసర సరుకులను అందించారు.
రంజాన్ పండగను అందరు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ,ఆనందోత్సహాలతో జరుపుకోవాలన్నారు. నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఏకే ఫౌండేషన్ ఏర్పాటు చేశామని సంస్థ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకొని తోఫాలను అందజేశామన్నారు.
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…