Telangana

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి

_సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ కార్య కర్తల సమావేశం లో నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో నిత్యావసరాల సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.బియ్యం,పప్పులు,కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.2014 ధరలను పరిశీలిస్తే 50 శాతం నుండి 200 శాతం పెరిగాయని.గ్యాస్ ధరలు 1200 రూపాయలకు పెంచిదని.ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల లో ఉపాధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని.మోడీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ లను తెచ్చి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఒకవైపు పేదల పైన భారాలు మోపుతు మరోవై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి తుంగలో తొక్కిందని విమర్శించారు.దళితులకు 3 ఏకరాల భూమి ఏమైందిని ప్రశ్నించారు.డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకు ఇవ్వలేదని.గృహ లక్ష్మి పతకం దర్కాస్తు దారులకు సర్వే చేసి 3 లక్షల రూపాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు,పాండు రంగా రెడ్డి,జార్జ్,శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 hour ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago