Telangana

గీతంలో సగర్వంగా ఏస్-2025 అవార్డుల ప్రదానం

పాఠ్యేతర కార్యలాపాలు, క్రీడలు, సమాజ సేవ, నాయకత్వంలో

అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులకు సత్కారం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ శనివారం ప్రతిష్టాత్మక ఏస్-2025 అవార్డుల ప్రదానోత్సవాన్ని సగర్వంగా నిర్వహించింది. పాఠ్యేతర కార్యకలాపాలు, క్రీడలు, సమాజ సేవ, నాయకత్వంలో అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించింది. వారితో పాటు ఉత్తమ సహాయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్ సీసీ క్యాడెట్ల అమూల్యమైన సహకారాన్ని కూడా గుర్తించి, వారిని కూడా సముచిత రీతిలో సత్కరించి, ఉత్సాహపరిచింది.బహుళ విభాగాలలోని విద్యార్థుల విభిన్న ప్రతిభ, అత్యుత్తమ ప్రదర్శనలను ప్రశంసిస్తూ మొత్తం 52 అవార్డులను గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-స్టూడెంట్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ ప్రదానం చేశారు. విద్యతో పాటు సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంలో గీతం నిబద్ధతకు ఈ కార్యక్రమం ఓ నిదర్శనంగా నిలిచింది.గౌరవనీయమైన అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తదితరులు హాజరైన ఈ ఏస్ అవార్డులు-2025 ప్రదానోత్సవం విద్యార్థులకు ప్రేరణగా నిలవడమే గాక, వర్సిటీ యొక్క అత్యుత్తమ ప్రదర్శన, నాయకత్వ వారసత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

38 minutes ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

13 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

13 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

13 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

13 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago