రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి :
భైక్ పై వెళ్తున్న యువకున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, రెగోడ్ మండలం, ప్యారారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ విట్ఠల్, జయమ్మ ల పెద్దకుమారుడు ప్రేమ్ కుమార్ (25), ఎస్.ఎన్ కాలని,రామచంద్రాపురంలో నివసిస్తూ బైక్ షో రూమ్ లో సేల్స్ ఎగ్జ్ క్యూటివ్ గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి 1.30 సమయంలో భైక్ పై రామచంద్రాపురం వైపు తన బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని అతని తలపై నుండి వెళ్లడం తో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకుపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…