పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపత్లో నిర్వహించే కవాతులో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నిర్వహించే ముందస్తు క్యాంపుకు హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి గౌరంగో జెనా ఎంపికయ్యారు . గుజరాత్లోని ఆనంద్ జిల్లా సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయంలో ఈనెల 20-28వ తేదీ వరకు జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్లో జెనా పాల్గొంటారని గీతం ఎన్ఎన్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ క్యాంపులో భాగంగా నిర్వహించనున్న ఎగ్జిబిషన్లో యాక్షన్ ఫొటోలు , బ్యానర్లు , చార్టులు , ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల నివేదికలు , నిర్వహించిన ప్రాజెక్టులు వంటివాటిని ప్రదర్శించడంతో పాటు కవాతు , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కూడా శిక్షణ ఇస్తారని ఆయన వివరించారు . దేశం నలుమూలల నుంచి పాల్గొనే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లలో 200 మంది అత్యుత్తమ ప్రతిభావంతులను గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎంపిక చేస్తారని డాక్టర్ నాగేంద్రకుమార్ తెలియజేశారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…