పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రానున్న రోజుల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దబోతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ టూర్ లో భాగంగా బుధవారం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని యశ్వంత్పుర్, చిక్బల్లాపూర్ మార్కెట్ యాడలను ఎమ్మెల్యే జిఎంఆర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆయా మార్కెట్ కమిటీల అధికారులతో సమావేశమై క్రయ విక్రయాలు, దుకాణాల కేటాయింపులు, వ్యాపార నిర్మాణ అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అతి కొద్ది కాలంలోనే ఏటా ఆరు కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకోవడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…