పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రానున్న రోజుల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దబోతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ టూర్ లో భాగంగా బుధవారం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని యశ్వంత్పుర్, చిక్బల్లాపూర్ మార్కెట్ యాడలను ఎమ్మెల్యే జిఎంఆర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆయా మార్కెట్ కమిటీల అధికారులతో సమావేశమై క్రయ విక్రయాలు, దుకాణాల కేటాయింపులు, వ్యాపార నిర్మాణ అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అతి కొద్ది కాలంలోనే ఏటా ఆరు కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకోవడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…