అమీన్ పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
నిజాం నిరంకుశ వ్యతిరేక పాలక, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పటాన్చెరు బీజేపీ నేత ఎడ్ల రమేష్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ పద్మశాలిసంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . తెలంగాణ ఉద్యమంలో 85 సంవత్సరాల వయస్సులో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహదాతగా తనకు అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. పద్మశాలి సంఘం నేతలు ఎక్కడ విగ్రహం పెట్టాలో నిర్ణయిస్తే అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసంమూడు దశల్లో ఉద్యమాల్లోప్రముఖ పాత్ర పోషించారని ఎడ్ల రమేష్ కొనియాడారు. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల స్వప్నం మాత్రం ఆయన చూడలేకపోయాడన్నారు. నిరంతరం ప్రజాసేవ కోసం తపించే వ్యక్తి సేవలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు.
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…