Telangana

రుద్రారంలో ఉద్రిక్తంగా మారిన భూ వివాదం

_పేరం గ్రూపుకే టోకరా వేసిన ఘనులు

_ఫ్లాట్ల కొనుగోలు దారుల నష్టపోకుండా పేరం గ్రూపు చర్యలు

మనవార్తలు ,పటాన్‌చెరు:

రుద్రారంలో ఓ వెంచర్ యాజమాన్యం, గ్రామస్థుల మధ్య నెలకొన్న భూ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే రుద్రారం గ్రామం 711, 712 సర్వే నంబర్లలో పన్నెండు ఎకరాలు, 713,718,719,733 సర్వే నంబర్లలో 42.5 ఎకరాలను పేరం గ్రూప్ కొనుగోలు చేసింది. కానీ 711, 712 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల మూడు గుంటలు, 713,718,719,733 సర్వే నంబర్లలో 41ఎకరాలకు మాత్రమే పేరం గ్రూపుకు పొజిషన్ లభించటంతో మిగతా భూమిని పేరం గ్రూపు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సదరు యాజమాన్యం ఉన్న భూములోనే వెంచర్ చేసి వినియోగదారులకు విక్రయించింది. ఈ నేపధ్యంలో 712 సర్వే నంబర్లో 17.5 గుంటల భూమిని 2019లో పేరం గ్రూపుకు విక్రయించిన గాండ నర్సింలు, 713 సర్వే నంబర్లో 2018 లో 3.5 ఎకరాలు విక్రయించిన అనసూయమ్మలు 2020 వ సంవత్సరంలో సర్దార్ హరిపాల సింగ్ కు ఆభూమిని సెకండ్ రిజిస్ట్రేషన్ చేయటంతో వీరిరువురిపై అప్పట్లో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్ చేయటంతో ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది.

ఈ నేపధ్యంలో గ్రామానికి చెందిన ఒడ్డే మల్లయ్య కూడా 712 సర్వే నంబరులో 1.34 గుంటల భూమిని పేరం గ్రూపుకి విక్రయించాడు. అయితే ఈ సర్వే నంబర్లకు ఆనుకుని ఒడ్డే మల్లయ్యకు 658 సర్వే నెంబరులో 1.20 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని మల్లయ్య కుటుంబసభ్యులు విలేకరులకు తెలిపారు. పేరం గ్రూపు యాజమాన్యం తమ భూమిని కబ్జా చేసిందని వారు ఆరోపించి యాజమాన్యం తో గొడవకు దిగటంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. సదరు వివాదంపై ఏడీ పలూమార్లు సర్వే నిర్వహించినట్టు సమాచారం. మల్లయ్య కుటుంబీకులు సర్వేను బేఖాతరు చేయడంతో పోలీస్ బందోబస్తుతో శనివారం హద్దులు నిర్ణయించారు. ఒడ్డే మల్లయ్య ఇటీవలే మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు పేరం యాజమాన్యంతో వాగ్వాదానికి దిగటంతో వివాదం పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ కు చేరింది. ఏడి సర్వే ప్రామాణికంగా తీసుకొని వివాదానికి తెర దించకపోతే చర్యలు తప్పవని ఈ సందర్బంగా పోలీసులు హెచ్చరించినట్టు సమాచారం.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

10 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago