లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని పటాన్ చెరు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు .అనంతరం సాయిరాం గుప్తా మాట్లాడుతూ నానమ్మ తాతయ్య నంగునూరు వజ్రమ్మ నాగయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటిసారిగా నిర్వహించిన చలివేంద్రంలో వేసవికాలంలో ప్రయాణికులు, కార్మికులు, సాధారణ ప్రజలకు మజ్జిగను అందించారు, ప్రజల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాద్రి పృథ్వి , ముదిరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ కాడి విజయ్,గూడెం విక్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *