Telangana

శేరిలింగంపల్లి లో పక్కదారి పట్టిన దళిత బంధు

_హే గాంధీ ఏంది ఇది

_అర్హులను కాదని అనుచరులకే పట్టం

_ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కుమ్మక్కై దోచిపెట్టిన వైనం ,సహకరించిన అధికారులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రజా ప్రతినిధులు అర్హులను కాదని తమ అనుచరులకు కట్టబెట్టి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పేద దళితులకు అందవలసిన దళిత బంధు పథకం పక్కదారి పట్టి అధికార పార్టీ నాయకుల ఇళ్లకు చేరుకుంది. పేద ప్రజలకు చేరవలసిన దళిత బంధు ఖరీదైన కార్లలో తిరిగే, బహుళ అంతస్థుల భవనాలు ఉండి నెలకు లక్షల రూపాయల అద్దెలు వచ్చే అధికార పార్టీ కి చెందిన ధనవంతులు, నాయకులకు, ప్రజా ప్రతినిధుల అనుచరులకు అందజేశారు. దీంతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న దళిత బంధు పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన కార్లు, ఇతర పరికరాలు పథకంలో మంజూరయ్యే అన్ని అధికార పార్టీ వారికే దక్కుతున్నాయని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా పాలకుల తీరు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని, అందులో డివిజన్ కు 10మంది చొప్పున కడు పేదవారిని ఎంపిక చేయాలని నిబంధనలుండగా, వాటిని తుంగలో తొక్కి, లబ్దిదారుల ఎంపిక వివాదాస్పదంగా మారింది.

చందానగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హాఫీజ్ పెట్, ఇలా అన్ని డివిజన్లలోను పైరవీకారులకు, తమ బంధుగణానికి కట్టబెట్టారు.లక్షల రూపాయల అద్దెలు వచ్చే ధనవంతులు అర్హులేనంటా.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొన్ని డివిజన్ లలో నెలకు లక్షల రూపాయల అద్దెలు వచ్చే ధనవంతులు, ఖరీదైన కార్లలో తిరుగుతూ, బంగారు ఆభరణాలు కలిగిన వారికి దళిత బంధును అందజేశారు. అసలైన అర్హులకు మొండి చెయ్యి కూలి నాలి చేసుకొని పొట్టపోసుకునే వారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉండగా, వారిని అసలు పరిగణలోకే తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరైన వాటిలో ఎక్కువ శాతం ఉన్నత కుటుంబాల వారికి మాత్రమే దళిత బంధు పథకం అమలు చేశారు.

రాని నిరుపేదలు ఇదేందని సంబంధికులను ప్రశ్నిస్తే రెండో విడతలో పరిశీలిస్తామని చెప్తున్నారని అర్హులైన బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ వారి ఆటలకు అడ్డేలేకుండా పోతుందని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా వీటిపైన విచారణ జరిపించాలని, అర్హులైన వారికి పథకం ఫలితాలు అందేలా చూడాలని కోరుతున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago