Telangana

శేరిలింగంపల్లి లో పక్కదారి పట్టిన దళిత బంధు

_హే గాంధీ ఏంది ఇది

_అర్హులను కాదని అనుచరులకే పట్టం

_ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కుమ్మక్కై దోచిపెట్టిన వైనం ,సహకరించిన అధికారులు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రజా ప్రతినిధులు అర్హులను కాదని తమ అనుచరులకు కట్టబెట్టి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పేద దళితులకు అందవలసిన దళిత బంధు పథకం పక్కదారి పట్టి అధికార పార్టీ నాయకుల ఇళ్లకు చేరుకుంది. పేద ప్రజలకు చేరవలసిన దళిత బంధు ఖరీదైన కార్లలో తిరిగే, బహుళ అంతస్థుల భవనాలు ఉండి నెలకు లక్షల రూపాయల అద్దెలు వచ్చే అధికార పార్టీ కి చెందిన ధనవంతులు, నాయకులకు, ప్రజా ప్రతినిధుల అనుచరులకు అందజేశారు. దీంతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న దళిత బంధు పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన కార్లు, ఇతర పరికరాలు పథకంలో మంజూరయ్యే అన్ని అధికార పార్టీ వారికే దక్కుతున్నాయని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా పాలకుల తీరు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని, అందులో డివిజన్ కు 10మంది చొప్పున కడు పేదవారిని ఎంపిక చేయాలని నిబంధనలుండగా, వాటిని తుంగలో తొక్కి, లబ్దిదారుల ఎంపిక వివాదాస్పదంగా మారింది.

చందానగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హాఫీజ్ పెట్, ఇలా అన్ని డివిజన్లలోను పైరవీకారులకు, తమ బంధుగణానికి కట్టబెట్టారు.లక్షల రూపాయల అద్దెలు వచ్చే ధనవంతులు అర్హులేనంటా.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొన్ని డివిజన్ లలో నెలకు లక్షల రూపాయల అద్దెలు వచ్చే ధనవంతులు, ఖరీదైన కార్లలో తిరుగుతూ, బంగారు ఆభరణాలు కలిగిన వారికి దళిత బంధును అందజేశారు. అసలైన అర్హులకు మొండి చెయ్యి కూలి నాలి చేసుకొని పొట్టపోసుకునే వారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉండగా, వారిని అసలు పరిగణలోకే తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరైన వాటిలో ఎక్కువ శాతం ఉన్నత కుటుంబాల వారికి మాత్రమే దళిత బంధు పథకం అమలు చేశారు.

రాని నిరుపేదలు ఇదేందని సంబంధికులను ప్రశ్నిస్తే రెండో విడతలో పరిశీలిస్తామని చెప్తున్నారని అర్హులైన బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ వారి ఆటలకు అడ్డేలేకుండా పోతుందని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా వీటిపైన విచారణ జరిపించాలని, అర్హులైన వారికి పథకం ఫలితాలు అందేలా చూడాలని కోరుతున్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago