మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
ఆదర్శనగర్, శేరిలింగంపల్లి, ప్లాట్ నెం. 53, స. నెం. 58/1 లో మిరియాల ప్రీతం నిర్మించిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని‘ప్రజావాణి’లో జోనల్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి.స్టెటస్కోలో నిర్మాణం చేస్తున్న సందర్భంలో కంటెంప్ట్ కూడా ఫైల్ చేసినా బిల్డర్ బాజాప్తా నిర్మాణం చేశాడని కసిరెడ్డి భాస్కరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.సెల్లార్ తో పాటు అనేక అక్రమ ఫ్లోర్లు నిర్మించడంతో పాటు 53 గజాలు అదనంగా కబ్జా చేశాడనే విషయం టౌన్ ప్లానింగ్ దర్యాప్తులో తేలిందని వెంటనే చర్యలు తీసుకోవాలని ‘జనం కోసం’ డిమాండ్ చేసిందన్నారు.హోటల్ పేరు పెట్టి హోటల్ నడుపడం లేదని, కోర్టు కేసు దృష్ట్యా అలా నడుపుతున్నట్టు ఫేక్ హోటల్ సృష్టించాడని ‘జనం కోసం’ జోనల్ కమీషనర్ కు ఇచ్చిన ఫిర్యాదు పేర్కొన్నారు.వెంటనే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ‘జనం కోసం’ జోనల్ కమీషనర్ ను డిమాండ్ చేసిందన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…