Telangana

శక్తి నిల్వపై విస్తృత శోధన

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో వెల్లడించిన ఏఆర్ సీఐ శాస్త్రవేత్త డాక్టర్ బులుసు శారద

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

శక్తి నిల్వ పదార్థాలు, పరికరాలపై అధునాతన పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇది క్రమంగా బ్యాటరీలు, సూపర్-కెపాసిటర్లలో ఆవిష్కరణలకు దారితీస్తాయని భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన- పౌడర్ మెటలర్జీ నూతన పదార్థాల కోసం అంతర్జాతీయ అధునాతన పరిశోధనా కేంద్రం (ఏఆర్ సీఐ) శాస్త్రవేత్త డాక్టర్ బులుసు వి.శారద తెలియజేశారు. అధునాతన పదార్థాలు, బ్యాటరీల కేంద్రం (సీఏఎంబీ) విభాగాధిపతి అయిన ఆమె గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో ‘బ్యాటరీలపై అధునాతన పరిశోధనలు, ఆవిష్కరణలు’ అనే అంశంపై బుధవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు.‘సైద్ధాంతిక పరిశోధనను సాంకేతికతగా మార్చడం, దానిని భారతీయ పరిశ్రమలకు బదిలీ చేయడం’ కార్యక్రమం కింద నిర్వహించిన ఈ ఉపన్యాసంలో, లిథియం-అయాన్, సోడియం-అయాన్, లిథియం-సల్ఫర్ బ్యాటరీలు, సూపర్-కెపాసిటర్లలోని వర్తమాన పురోగతుల గురించి డాక్టర్ శారద వివరించారు.

నానో-నిర్మిత పదార్థాలు, అధునాతన తయారీ పద్ధతులతో పాటు, శక్తి సాంద్రత, భద్రత, సైక్లింగ్ స్థిరత్వం, అయాన్ రవాణా, తక్కువ ఖర్చులోని కీలక సవాళ్లు, ఆవిష్కరణల గురించి ఆమె చర్చించారు.అత్యంత ఖర్చుతో కూడుకున్నదైన కోబాల్డ్ రహిత కాథోడ్లు, సోడియం-అయాన్ బ్యాటరీలు, లిథియం-సల్ఫర్ వ్యవస్థలు, పౌచ్ సెల్ తయారీ వంటి బ్యాటరీ పదార్థాలలో ఏఆర్ సీఐలో కొనసాగుతున్న దేశీయ పరిశోధన కార్యక్రమాలను డాక్టర్ శారద వివరించారు.

వాటి పారిశ్రామిక ఔచిత్యాన్ని, సాంకేతిక సంసిద్ధత స్థాయిలను నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఈ ఉపన్యాసం, అధ్యాపకులకు స్థిరమైన శక్తి నిల్వ సాంకేతికతలపై విలువైన అంతర్దృష్టులను అందించింది.భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి.విశ్వంతో కలిసి గీతం విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బీ.వీ.ఆర్. టాటా గౌరవ అతిథిని సత్కరించారు. ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పీ.ఎం. స్వరూప్ రాజు సమన్వయం చేశారు. పలువురు భౌతిక, రసాయన, గణిత శాస్త్ర అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

admin

Recent Posts

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

16 hours ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

16 hours ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago

కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి_ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్…

2 days ago

గీతంను సందర్శించిన డీఏవీ విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఐఐటీ హైదరాబాదు ప్రాంగణంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్…

3 days ago