మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దుచేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ 18 వ జాతీయ మహాసభలలో సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన చుక్క రాములు కు బుధవారం శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. వెనిజులాపై అత్యంత పాశవికంగా దాడిచేసి అధ్యక్షుని బంధించి తమదేశంలో విచారణ జరుపుతామని అమెరికా అంటుందంటే ఐక్యరాజ్యసమితి ఉన్నట్టా, లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ చట్ట సవరణతో, రైతుచట్టంతో, లేబరుకోడ్స్ తో కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకొంటున్నదని తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, వి. సదాశివ రెడ్డి, కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…