Telangana

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్ ధనీష్ అబ్దుల్ ఖాదర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమకు అవసరాలకు తగ్గట్టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలను అలవరచుకుంటే, ఆ రంగంలోనే లెక్కకు మిక్కిలిగా ఉపాధి అవకాశాలున్నాయని బెంగళూరులోని ఎస్ఎస్ టెక్నాలజీస్ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్ ధనీష్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏరోనాటిక్స్, స్పేస్, డిఫెన్స్ లో విజయవంతంమైన కెరీర్ కోసం డిజైన్ ఇన్నోవేషన్’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.చైనా ఉత్పత్తులు, యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించాక స్వదేశీ ఉత్పత్తికి ముందుకు రావడం ఏరోస్పేస్, రక్షణ రంగాలలో గణనీయమైన అవకాశాలను సృష్టించిందని ధనీష్ చెప్పారు. విశ్వవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ కంపెనీలు తామే స్వయంగా, లేదా భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డీఎల్), దాని అనుబంధ సంస్థలు దేశీయంగా రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించడానికి, తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ధనీష్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ ఆమోదించినట్టు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సాంకేతిక భాగస్వామ్యం ద్వారా మనదేశంలో రక్షణ ఉత్పత్తుల ఉత్పత్తిని సులభతరం చేయడానికి ప్రభుత్వం ఇతర దేశాలతో అనేక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా రక్షణ కారిడార్లు, ఏరోస్పేస్ పార్కులు నెలకొల్పుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్ బస్, లాక్ హీడ్ మార్టిన్, సఫ్రాన్ వంటి ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ సంస్థలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

గుజరాత్లో ప్రతిపాదిత ఎయిర్ బస్-టాటా విమానాల తయారీ సౌకర్యం, రక్షణలో భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (ఎఫ్డీఐ) పొందే ధీరూభాయ్ అంబానీ ఏరోస్పేస్ పార్క్, హైదరాబాద్ లో తయారవుతున్న బోయింగ్ విడిభాగాలు, జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో దేశంలోనే అతి పెద్ద విమాన ఇంజన్ నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) సౌకర్యాన్ని ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్ ఏర్పాటు చేయడం, ఏరోస్పేస్-రక్షణ రంగ తయారీకి ప్రధాన కేంద్రంగా తెలంగాణ ఎదుగుతున్న కీలక పరిణాలను ధనీస్ వివరించారు. ఈ పరిణామాలు ఏరోస్పేస్, రక్షణ రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ ను సూచిస్తోందని చెప్పారు.తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ.అక్తర్ ఖాన్ అతిథిని పరిచయం చేసి, సత్కరించారు. ఈ ఉపన్యాస కార్యక్రమంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

3 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

3 days ago