Telangana

బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు చారిత్రాత్మకం- నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని ,ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో టీపీసీసీ పిలుపుమేరకు అసెంబ్లీ లో బీసీ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఏఐసీసీ అగ్రనేతలు,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ల చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు.

ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం బీసీ కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్లు పెంచేలా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేయడం ద్వారా యావత్ బీసీ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలు చేకూర్చాలని కొనియాడారు.

మరోవైపు ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ఆ వర్గ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి 30 ఏండ్ల కలను సాకారం చేశారని కొనియాడారు. ఒకే రోజు రెండు చారిత్రాత్మక బిల్లులను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడంతో పాటు ఉభయ సభలలో వాటిని ఆమోదించడం ద్వారా తెలంగాణ అసెంబ్లీ నిర్ణయాలు యావత్ భారతావనికే ఆదర్శంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రజల పక్షాన పనిచేస్తూ, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని మరోసారి రుజువైందన్నారు.ఈ రెండు బిల్లులు ఆమోదంతో భారత రాజకీయలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు.
ఈ రెండు బిల్లులు ఆమోదంలో సహకరించిన ప్రతి ఒక్కరికి యావత్ తెలంగాణ ప్రజానీకం రుణపడి ఉంటామని తెలిపారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago