మనవార్తలు ,రామచంద్రాపురం :
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేషన్ అసరాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన ఎండీ ఫజిల్ గత రెండు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఐదు సంవత్సరాల వయస్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చదించేందుకు ముందుకువచ్చాడు. బాలుడిని షైన్ మోడల్ స్కూల్ లో చేర్పించి ఫీజులు చెల్లించాడు. అంతేకాకుండా బాలుడి చదువు అవసరమయ్యే పుస్తకాలు , స్కూల్ డ్రెస్ లను ఏకే ఫౌండేషన్ చెల్లించింది. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదీర్ ను స్థానికులు అభినందించారు .
