Telangana

90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాప

ముత్యంలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్ చెరు,మనవార్తలు ప్రతినిధి

ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

శనివారం పటాన్చెరు మండల పరిధిలోని పోచారం, ముత్తంగి, చిట్కుల్, రామేశ్వరం బండ, బచ్చు గూడెం, ఇంద్రేశం, ఐనోలు, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల గ్రామాలలో 95 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో చేపటనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు నర్సరీలు ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతినెల నిధులు అందిస్తూ, పారదర్శకంగా ఖర్చు చేయడం జరుగుతోంది తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లేనప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమవుతుందని తెలిపారు..

అనంతరం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియ కాలనీలో నూతన రామాలయం నిర్మాణ పనుల కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎంపీడీవో బన్సీలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago