Telangana

సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో చేయి కోల్పోయిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పారిశ్రామిక వాడలో గల సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో ప్రెస్సింగ్ మిషన్లో పనిచేస్తూ కుడి చేతిని కోల్పోయిన అమర్ సింగ్ కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం పరిశ్రమ తో పాటు పటాన్ చెరు పట్టణంలోని అమర్ సింగ్ చికిత్స తీసుకుంటున్న ధ్రువ హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్యులోజ్ పరిశ్రమలో అమర్ సింగ్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం జనరల్ షిఫ్ట్ కు వెళ్ళగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రెస్సింగ్ మిషను లో ఆపరేట్ చేసే క్రమంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడంతో అమర్ సింగ్ చేసే క్రమంలో తన కుడిచేయిని కోల్పోవలసి వచ్చిందని వాపోయారు. ప్రమాదం జరిగి రోజు గడిచిపోయినప్పటికీ జరిగిన సంఘటనను యాజమాన్యం పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. వైద్య ఖర్చు లు ఇవ్వకుండా చేతులు దులుపుకునే ప్రయత్నం యజమాన్యం చేస్తుందని, అమర్ సింగ్ వైద్య ఖర్చులన్నీ పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా భరించడంతోపాటు తన కుడి చేతిని కోల్పోవడంతో అమర్ సింగ్ కుటుంబం పూర్తిగా రోడ్డు మీద వచ్చిందని, కార్మిక శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శాఖల అధికారులు వెంటనే స్పందించి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవడం తోపాటు యాజమాన్యంను కఠినంగా శిక్షించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమర్ సింగ్ కుటుంబం రోడ్డున పడకుండా పరిశ్రమ యాజమాన్యం 30 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పరిశ్రమలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికునికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందడం లేదని, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో బాధితుడు కుటుంబం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

8 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

11 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago